కర్నాటక, జార్ఖండ్​లలో భూకంపం

కర్నాటక, జార్ఖండ్​లలో భూకంపం

న్యూఢిల్లీ: దేశంలో ఈ రోపు రెండు చోట్ల భూకంపం సంభవించింది. జార్ఖండ్, కర్నాటక రాష్ట్రాల్లో శుక్రవారం ఉదయం భూ ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టర్ స్కేల్‌పై 4.0 తీవ్రతతో కర్నాటకలోని హంపిలో భూమి కంపించగా.. జార్ఖంఢ్ లోని జంషెడ్​పూర్ లో 4.7 తీవ్రతతో మరొక భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మోలజీ తెలిపింది. ఈ రెండు ప్రాంతాల్లో స్వల్ప స్థాయిలో భూ ప్రకంపనలు రావడంతో ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం జరగలేదని అధికార వర్గాలు తెలిపాయి.