
హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ వినయ్ భానురెడ్డి భౌతిక కాయం శుక్రవారం సిటీకి చేరుకుంది. రాత్రి 10 గంటల సమయంలో బేగంపేట ఎయిర్పోర్టుకు తీసుకొచ్చారు. సైనిక గౌరవాలతో నివాళులు అర్పించారు. అక్కడి నుంచి మల్కాజిగిరిలోని ఇంటికి తరలించారు. అరుణాచల్ ప్రదేశ్లో భారత సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్ గురువారం కూలిపోయింది. పశ్చిమ కమెంగ్ జిల్లాలోని బోమ్డిలా ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో హెలికాప్టర్ పూర్తిగా కాలిపోయింది. అందులో ఉన్న వినయ్భానుతోపాటు పైలట్ దుర్మరణం చెందారు. స్వస్థలమైన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం గ్రామంలో ఆదివారం వినయ్భాను భౌతిక కాయానికి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుపనున్నారు. – వెలుగు, హైదరాబాద్