ఉమీద్ పోర్టల్ ను సద్వినియోగం చేసుకోవాలి : మిల్లీ అసోసియేషన్ ప్రెసిడెంట్ఉమర్ ఖాన్

ఉమీద్ పోర్టల్ ను సద్వినియోగం చేసుకోవాలి :  మిల్లీ అసోసియేషన్ ప్రెసిడెంట్ఉమర్ ఖాన్

మెదక్​టౌన్, వెలుగు:  ప్రభుత్వం ప్రారంభించిన ఉమీద్​ పోర్టల్​లో వక్ఫ్, దర్గాలు, కబ్రస్తాన్ కు సంబంధించిన ఆస్తులను నమోదుచేసుకోవాలని మెదక్​ మిల్లీ అసోసియేషన్​ ప్రెసిడెంట్​ఉమర్ ఖాన్​సూచించారు. ఆదివారం మెదక్ పట్టణంలోని ఆజంపుర వీధిలో ఉమీద్​ పోర్టల్ కార్యాలయాన్ని జామా మసీద్​ ఇమామ్​ హఫీజ్​ సయ్యద్​ ఖాజా మొయిజొద్దీన్​తో కలిసి  ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం వక్ప్​ ఆస్తుల నమోదుకు ఉమీద్ పోర్టల్‌ ఏర్పాటుచేసిందన్నారు. 

ఈ సెంటర్​ ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సేవలందిస్తోందని చెప్పారు. కార్యక్రమంలో మిల్లీ అసోసియేషన్ సభ్యులు సుజాత్​అలీ సూఫీ, సయ్యద్ నసీర్ అహ్మద్ జౌహరీ, మిర్ జఫరుల్లా తాహీర్, మహ్మద్​ రియాజుద్దీన్, సయ్యద్ సాదత్​ అలీ, మహ్మద్​ నదీమ్ ఖాన్, ఫాజిల్, బుర్హానొద్దీన్,  జబ్బార్ అహ్మద్, నియాజీ పాల్గొన్నారు.