- ట్విట్టర్ వేదికగా ప్రకటించిన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ
- బహదూర్పురా నుంచి అక్బరుద్దీన్కొడుకు నూరుద్దీన్ పోటీ చేసే అవకాశం
హైదరాబాద్, వెలుగు : జూబ్లీహిల్స్సెగ్మెంట్ నుంచి మజ్లిస్ అభ్యర్థిగా షేక్పేట డివిజన్ కార్పొరేటర్రషీద్ ఫరాజుద్దీన్ను బరిలో దింపుతున్నట్లు ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ఒవైసీ సోమవారం ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ సెగ్మెంట్కు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ క్రికెటర్అజారుద్దీన్, బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ బరిలో ఉన్నారు. గ్రేటర్ పరిధిలో 9 సెగ్మెంట్ల నుంచి మజ్లిస్ పోటీ చేస్తుందని ఇటీవల అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు.
ఆరుగురు అభ్యర్థులను గతంలోనే ప్రకటించగా.. తాజాగా జూబ్లీహిల్స్ నుంచి రషీద్ ఫరాజుద్దీన్ పేరును ఆయన వెల్లడించారు. అయితే, రాజేంద్రనగర్ సెగ్మెంట్ నుంచి శాస్త్రినగర్ కార్పొరేటర్ మహ్మద్ ముబీన్, బహదూర్ పురా నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ కొడుకు నూరుద్దీన్ ఒవైసీని పోటీలో నిలబెట్టే చాన్స్ ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.