రాజాసింగ్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి

రాజాసింగ్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి

రాజాసింగ్ పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఎంఐఎం ఎమ్మెల్యే పాషా ఖాద్రీ కోరారు. రాజాసింగ్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉన్నాయని.. ఆయనను సభ నుంచి బహిష్కరించాలంటూ స్పీకర్ కు లేఖ రాశారు. నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని.. రాజాసింగ్ శాసన సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలన్నారు.
 
కాగా తెలంగాణ ప్రభుత్వం తనపై కక్ష కట్టిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. కావాలనే అక్రమ కేసులు పెట్టి వేధిస్తుందన్నారు. కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. న్యాయస్థానాలపై తనకు నమ్మకం ఉందన్నారు. న్యాయం తనవైపే ఉందని..త్వరలో  అన్ని విషయాలు వెల్లడిస్తానని చెప్పారు. ప్రస్తుతం తనకు న్యాయస్థానం కండిషన్ బెయిల్ ఇచ్చిందన్నారు.