కేంద్రం సామాన్య ప్రజల నడ్డి విరుస్తోంది: మంత్రి ఎర్రబెల్లి

 కేంద్రం సామాన్య ప్రజల నడ్డి విరుస్తోంది: మంత్రి ఎర్రబెల్లి

దండుగా అన్న వ్యవసాయాన్ని పండగల చేసిన ఘనత సీఎం కేసీఆర్ దని..రాష్ట్ర రైతులకు మహార్దశ కల్పించారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొనియాడారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం చింతలపల్లి గ్రామంలో నాబార్డ్ నిధులతో నిర్మించిన 1500 మెట్రిక్ టన్నుల గోదాంను, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయాన్ని ఆయన ఇవాళ ప్రారంభించారు.

రైతులకు పెట్టుబడి సహాయం అందించిన రైతు బంధువుడు కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. 400 రూపాయలు ఉన్న గ్యాస్ ధరను 1200 చేసింది బీజేపీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలతో పాటు నిత్యవసర ధరలు పెంచిన కేంద్రం సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నదని మండిపడ్డారు.