కరీంనగర్ లో మట్టి రోడ్లు కనిపించ కుండా చేస్తం : గంగుల కమలాకర్

కరీంనగర్ లో మట్టి రోడ్లు కనిపించ కుండా చేస్తం : గంగుల కమలాకర్

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రోడ్ల మరమ్మత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసిందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.  కరీంనగర్ లో మిగిలిపోయిన రోడ్ల నిర్మాణం కోసం జీవో నెంబర్ 406, 407 ద్వారా రూ.75 కోట్లు మంజూరు చేయడం జరిగిందని గంగుల చెప్పారు. నియోజకవర్గంలో మట్టి రోడ్డు అనేది కనిపించకుండా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. 

నియోజకవర్గంలో ఇప్పటివరకు ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ రోడ్లు 85 శాతం పూర్తయ్యాయని గంగుల కమలాకర్ చెప్పారు. రూరల్, పట్టణ రోడ్లను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. వచ్చే ఏడాది మార్చి లోపే అన్ని పనులు పూర్తి చేస్తామని మంత్రి గంగుల తెలిపారు.