మీకు మా ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదు

మీకు మా ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదు

కాంగ్రెస్ నాయ‌కుల‌కి టీఆర్ఎస్ ప్రభుత్వం గురించి విమర్శించే హక్కు లేదని అన్నారు మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ నాయకులు అన‌వ‌సరంగా కేసీఆర్ పై మాట్లాడుతున్నారని, తెలంగాణ కంటే మ‌రే రాష్ట్రం రైతుల‌కు గిట్టుబాటు ధ‌ర ఇవ్వడం లేద‌న్నారు మంత్రి . బుధ‌వారం మెద‌క్ లో ప‌ర్య‌టించిన హ‌రీష్ రావు.. ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నాయ‌కులు చేసిన విమ‌ర్శ‌ల‌ను తిప్పి కొట్టారు.

త‌మ ప్ర‌భుత్వం రైతులకు గిట్టుబాటు ధర క‌ల్పించింద‌ని, ఉచిత కరెంటు ఇచ్చింద‌న్న మంత్రి ‌… అందుకు మద్దతు ఇవ్వని వారంటే దేశంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల వారేన‌ని అన్నారు. రాష్ట్రంలోని రైతులు కరోనా తో ఇబ్బందులు పడుతున్న సమయంలో రైతు రుణమాఫీ కై 1200 కోట్లు రిలీజ్ చేశామన్నారు . వ్యవసాయ శాఖ అధికారులు రైతుల అకౌంట్ లోకి ఆ డ‌బ్బుని జమ చేస్తార‌ని తెలిపారు. దేశ చరిత్రలో రైతులు పండించిన పూర్తి పంట‌ను కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఆయ‌న అన్నారు . కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాలు రైతులను నట్టేట్లో ముంచార‌ని హరీష్ అన్నారు.

minister harish rao comments on congress party leaders