సిద్ధిపేట: బీజేపీ నేతలకు నిజం మాట్లాడితే వాళ్ల తల వేయి ముక్కలవుతుందనే శాపం ఉన్నట్టుందని, అందుకే అబద్ధం తప్ప నిజాలు మాట్లాడరని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్ధిపేటలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ... పాలమూరు మీటింగ్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు బీజేపీ నడ్డా అబద్ధాల పురాణం చదివారని మండిపడ్డారు.కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరాకు నీరు రాలేదని నడ్డా మొదటి అబద్ధం, కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో అవినీతి జరిగిందని రెండో అబద్ధం ఆడారని... ఇవన్నీ అసత్యాలను మంత్రి కొట్టిపారేశారు. కేంద్ర పథకాలను రాష్ట్ర పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నామని నడ్డా చెప్పిన మూడో అబద్ధం విడ్డూరమన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పిన నాలుగో అబద్ధం... కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రాజెక్ట్ కోసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ప్రతి పక్షపార్టీల నాయకులు సిద్ధిపేట అభివృద్ధి మీద ఏడుస్తున్నారన్న ఆయన... సిద్ధిపేట లేకుండా కేంద్ర అవార్డులే ఉండవన్నారు. రాహుల్ ఏ హోదాలో డిక్లరేషన్ ఇస్తారో అర్థం కావడం లేదని మంత్రి హరీశ్రావు అన్నారు. రాజస్థాన్, ఛత్తీస్ఘడ్లో అమలు అవుతున్నాయా ? అని ప్రశ్నించారు. తెలంగాణ ద్రోహి చంద్రబాబు చెప్పులు మోసిన వారు కాంగ్రెస్ లో పెత్తనం చేస్తున్నారని అన్నారు. కేంద్రంలోని బీజేపీపై పోరాడలేని అసమర్థ పార్టీ కాంగ్రెస్ అంటూ హరీశ్రావు మండిపడ్డారు.
మరిన్ని వార్తల కోసం...