జహీరాబాద్ అభివృద్ధికి రూ. 50 కోట్లు మంజూరు

జహీరాబాద్ అభివృద్ధికి రూ. 50 కోట్లు మంజూరు

జహీరాబాద్: జహీరాబాద్ అభివృద్ధి కోసం కేసీఆర్ రూ.50 కోట్లు కేటాయించారని మంత్రి హరీశ్ రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీలో హరీష్ రావు పర్యటించారు. నగర బాటలో భాగంగా పలు వార్డులలో సైకిల్ పై పర్యటిస్తూ స్థానికుల సమస్యలను మంత్రి హరీశ్ రావు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా ఉన్న గీతారెడ్డి జహీరాబాద్ అభివృద్ధిని పట్టించుకోలేదని హరీశ్ రావు ఆరోపించారు. జహీరాబాద్ మున్సిపాలిటీలో తాగు నీటి సమస్య లేకుండా చేస్తామన్నారు. సంగమేశ్వర ప్రాజెక్ట్ ద్వారా లక్ష ఎకరాలకు గోదావరి జలాలు ఇస్తామన్నారు. మంత్రి హరీశ్ తో పాటు ఎమ్మెల్యే మాణిక్ రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం...

డిజిటల్ కరెన్సీ వల్ల మనీ ల్యాండరింగ్కు అవకాశం

మంత్రి పువ్వాడ అజయ్పై ఏ వన్గా కేసు నమోదు చేయాలి