ముదిరాజులకు అనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదు : హరీష్ రావు

ముదిరాజులకు అనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదు : హరీష్ రావు

సంగారెడ్డి : అన్ని కులాలకు కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే ఆత్మగౌరవ భావనాలు నిర్మించి ఇస్తోందన్నారు మంత్రి హరీష్ రావు. సంగారెడ్డిలో బీఆర్ఎస్​ అభ్యర్థి అయిన బీసీ బిడ్డ చింతా ప్రభాకర్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో సంగారెడ్డిని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

అన్ని వర్గాలను గౌరవించే గొప్ప సంస్కృతి BRS పార్టీది అని చెప్పారు. 2004 నుంచి 2014 వరకు ముదిరాజులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదన్నారు. ముదిరాజులను చట్ట సభలకు పంపింది BRS పార్టీ అన్నారు. గౌడ, ముదిరాజ్, పద్మశాలి, వీరశైవ కులాల భవన నిర్మాణాలకు కేటాయించిన స్థలాల పట్టాలను మంత్రి హరీష్ రావు అందజేశారు.