హైదరాబాద్, వెలుగు: పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి కాంగ్రెస్కే పిండం పెడ్తాడని మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. ఉచిత కరెంట్పై వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్కు తద్దినం పెట్టాడన్నారు. ప్రజలకు పిండాలు పెట్టి హింసించిన చరిత్ర కాంగ్రెస్, టీడీపీలదేనని ఆరోపించారు. తన ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్కు పిండం పెడ్తానని అనుడేందని రేవంత్పై మంత్రి మండిపడ్డారు. బుధవారం బీఆర్ఎస్ఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రులు నిరంజన్రెడ్డి, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్గౌడ్ వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. రేవంత్పిండం పెట్టాలనుకుంటున్నది సీఎం కేసీఆర్కు కాదని, తెలంగాణకు అని అన్నారు. రేవంత్ఇప్పటికీ తెలంగాణ ద్రోహుల చేతుల్లోనే ఉన్నారన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉండి చిల్లర మాటలేందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ రాజకీయంగా కక్షగట్టి ఉంటే రేవంత్ రోడ్లమీద తిరిగేవాడా అని అన్నారు. తెలంగాణ సమాజానికి రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్కే కాదు చంద్రబాబుకు కూడా కేసీఆర్ ప్రగతి భవన్లో ఆతిథ్యం ఇచ్చారని గుర్తుచేశారు. గద్దర్ మృతిపై తాము రాజకీయాలు చేయలేదన్నారు.
రాజకీయ సన్యాసం అని మాట తప్పిండు: నిరంజన్రెడ్డి
అంపశయ్య మీదున్న కాంగ్రెస్కు బతికున్నప్పుడే పిండం పెట్టేది రేవంత్రెడ్డేనని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. రేవంత్ అసహనంతో మాట్లాడుతున్నారని, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని బ్లాక్మెయిల్చేయడం రేవంత్కు అలవాటేనని మంత్రి సత్యవతి రాథోడ్అన్నారు. తాను తెలంగాణ వాదినని పదే పదే చెప్పుకుంటున్న రేవంత్ తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన ఒక్క మంచి పని అయినా చెప్పగలరా అని ప్రశ్నించారు. గద్దర్ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాకున్నా అసెంబ్లీ, కౌన్సిల్లో సంతాపం తెలిపామన్నారు. కేసీఆర్తో రేవంత్ పోల్చుకోవడం అంటే నక్కకు నాగలోకానికి పోలిక పెట్టడమేనని మంత్రి శ్రీనివాస్గౌడ్అన్నారు.