షాద్ నగర్,వెలుగు: ఫిట్స్ వచ్చి రోడ్డుపై పడిపోయిన వ్యక్తికి మంత్రి జూపల్లి కృష్ణారావు సాయమందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆదివారం మంత్రి జూపల్లి హైదరాబాద్ నుంచి కొల్లాపూర్ కు వెళ్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపంలోని రాయికల్ టోల్ ప్లాజా వద్ద ఫిట్స్ వచ్చి ఓ వ్యక్తి రోడ్డుపై పడిపోయాడు. వెంటనే చూసిన మంత్రి కారు దిగి అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. తన అనుచరులతో బాధితుడిని హాస్పిటల్ కు తరలించారు. దీంతో హై వేపై వెళ్తున్న వాహనదారులు మంత్రి చొరవను, సాయాన్ని అభినందించారు.
