కాంగ్రెస్ జోలికి వస్తే పండవెట్టి తొక్కుతాం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కాంగ్రెస్ జోలికి వస్తే పండవెట్టి తొక్కుతాం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

యాదాద్రి భువనగిరి: భువనగిరిలో మాకు పోటీ లేదు.. భువనగిరిలో మరోసారి కాంగ్రెస్ జెండా ఎరుగుతుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ జోలికి వస్తే పండవెట్టి తొక్కుతామన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ ను బొందపెట్టారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని బండకేసి కొట్టాలన్నారు మంత్రి కోమటిరెడ్డి. కేసీఆర్ లాగా మేం మాటలు చెప్పం..చేసి చూపిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని కేసీఆర్ అంటున్నడు.. రేవంత్ రెడ్డిని టచ్ చేస్తే మాడి మసైపోతారని హెచ్చరించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. 

మా ప్రభుత్వం జోలికి వస్తే ఎవ్వరినీ వదిలిపెట్టం అని అన్నారు. తెలంగాణలో ఉండేది.. ఉండబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు కోమటిరెడ్డి. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి.. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు మంత్రి కోమటిరెడ్డి. రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని జోస్యం చెప్పారు.  

లోక్ సభ ఎన్నికల సందర్భంగా భువనగిరిలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. సభకు ముందు భువనగిరి గంజ్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ,అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. ఈసభకు భారీ ఎత్తున ప్రజలు , కార్యకర్తలు పాల్గొన్నారు.