త్వరలో ఇందిరమ్మ ఇండ్లకు ప్రోసిడింగ్స్ అందజేస్తాం : మంత్రి కొండా సురేఖ

త్వరలో ఇందిరమ్మ ఇండ్లకు ప్రోసిడింగ్స్ అందజేస్తాం : మంత్రి కొండా సురేఖ

కాశీబుగ్గ/ ఖిలా వరంగల్ (మామునూరు), వెలుగు: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో త్వరలో ఇందిరమ్మ ఇండ్లకు ప్రోసిడింగ్​ కాపీలను అందజేస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం గ్రేటర్​ సిటీలోని 19వ డివిజన్​ పరిధిలోని వివేకానంద కాలనీలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.50 లక్షలతో చేపట్టనున్న స్మార్ట్​ వాటర్​ డ్రైన్​పనులకు మంత్రి బల్దియా మేయర్ గుండు సుధారాణి, వరంగల్ కలెక్టర్​ సత్య శారదాదేవితో కలిసి శంకుస్థాపన చేశారు.  

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇండ్ల పైనా ఉన్న 11కేవీ హైటెన్షన్​ వైర్లు తొలగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాజీవ్​ యువ వికాసం సెలక్షన్స్ జరుగుతున్నాయని తెలిపారు. అనంతరం మంత్రి, మేయర్ ను స్థానిక మహిళాలు సన్మానించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు వస్కుల బాబు, ఓని స్వర్ణలత, భాస్కర్, పోషల పద్మ, కాంగ్రెస్​ నాయకులు, ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.