
కాశీబుగ్గ/ ఖిలా వరంగల్ (మామునూరు), వెలుగు: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో త్వరలో ఇందిరమ్మ ఇండ్లకు ప్రోసిడింగ్ కాపీలను అందజేస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం గ్రేటర్ సిటీలోని 19వ డివిజన్ పరిధిలోని వివేకానంద కాలనీలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.50 లక్షలతో చేపట్టనున్న స్మార్ట్ వాటర్ డ్రైన్పనులకు మంత్రి బల్దియా మేయర్ గుండు సుధారాణి, వరంగల్ కలెక్టర్ సత్య శారదాదేవితో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇండ్ల పైనా ఉన్న 11కేవీ హైటెన్షన్ వైర్లు తొలగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాజీవ్ యువ వికాసం సెలక్షన్స్ జరుగుతున్నాయని తెలిపారు. అనంతరం మంత్రి, మేయర్ ను స్థానిక మహిళాలు సన్మానించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు వస్కుల బాబు, ఓని స్వర్ణలత, భాస్కర్, పోషల పద్మ, కాంగ్రెస్ నాయకులు, ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.