ఒక్కో ఇంటికి రూ.9 లక్షలు ఖర్చు

ఒక్కో ఇంటికి రూ.9 లక్షలు ఖర్చు

పేదవారు ఆత్మగౌరవంతో బతకాలన్నదే కేసీఆర్ లక్ష్యమన్నారు మంత్రి కేటీఆర్. వనస్థలిపురంలో డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించారు. రెండు ఎకరాల విస్తీర్ణంలో రూ.28 కోట్లతో మూడు బ్లాకులుగా 324 ఇళ్లు నిర్మించారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.9 లక్షలు ఖర్చుపెట్టామన్నారు.. గ్రేటర్ లో దాదాపు లక్ష ఇళ్లు 90 శాతం పూర్తయ్యాయన్నారు. వనస్థలిపురంలో సొంత ఇల్లు కొనుక్కోవాలంటే దాదాపు40- 50 లక్షల ఖర్చు అవుతుందన్నారు. లబ్ధిదారులకు ఇచ్చిన ఇళ్లు,పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.  దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఇళ్లు  పేదలకు నిర్మించి ఇవ్వలేదన్నారు.

బుమ్రా రాణిస్తే టీమిండియాకు తిరుగుండదు