రాష్ట్రంలో మూడోసారి కేసీఆరే సీఎం: మంత్రి కేటీఆర్

రాష్ట్రంలో మూడోసారి కేసీఆరే సీఎం: మంత్రి కేటీఆర్

రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని.. మూడోసారి కేసీఆర్ సీఎం అవుతారని జోస్యం చెప్పారు మంత్రి కేటీఆర్. ములుగు నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి తరపున ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ములుగు ప్రాంత అభివృద్ధి సీఎం కేసీఆర్ తోనే సాధ్యమయిందన్నారు. కళ్లముందే బూతద్దంలో చూసినట్లు ములుగు అభివృద్ధి కనిపిస్తుందన్నారు. 

కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమన్నారు మంత్రి కేటీఆర్. రైతుబంధు ఆపేందుకు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులు చేశారని మండిపడ్డారు. బీఆర్ ఎస్ పాలనలో ములుగును జిల్లాగా ప్రకటించి అన్ని విధాలా అభివృద్ధి చేశామన్నారు.  ములుగు జిల్లాకు మెడికల్ కాలేజీ ఇచ్చాం.. ప్రస్తుత ఎమ్మెల్యే సీతక్క తల్లిదండ్రులతో సహా గిరిజనులందరికి పోడు పట్టాలిచ్చామన్నారు మంత్రి కేటీఆర్.మూడోసారి బీఆర్ఎస్ గెలిస్తే రాష్ట్రంతో పాటు ములుగు జిల్లా కూడా మరింత అభివృద్ది అవుతుందని హామీ ఇచ్చారు  మంత్రి కేటీఆర్.