కేసీఆర్తోనే హైదరాబాద్లో శాంతిభద్రతలు సాధ్యం : కేటీఆర్

కేసీఆర్తోనే హైదరాబాద్లో శాంతిభద్రతలు సాధ్యం : కేటీఆర్

పేదవారికి అనేక సంక్షేమ పథకాలు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు మంత్రి కేటీఆర్. మూడోసారి అధికారంలోకి రాగానే మరో నాలుగు కొత్త కార్యక్రమాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఒకసారి చాన్స్ ఇవ్వమని అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు గతంలో చాలాసార్లు అధికారం ఇచ్చారని, అయినా ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. ఒకప్పుడు మల్లాపూర్, నాచారం ఇండస్ట్రీ ఏరియాలో కరెంట్ కూడా లేదని, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే 24 గంటల పాటు కరెంట్ అందిస్తున్నామన్నారు. ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి మద్దతుగా మల్లాపూర్ లో మంత్రి కేటీఆర్ రోడ్డు షో నిర్వహించారు. 

ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం 35 ఫ్లై ఓవర్లు కట్టించామన్నారు. ఉప్పల్ మీదుగా వెళ్లే ఒక్క ఫ్లై ఓవర్ ను కూడా కేంద్రం ప్రభుత్వం నిర్మించలేదకపోయిందని మండిపడ్డారు. హైదరాబాద్ బాగుంటే మొత్తం తెలంగాణ బాగుంటుందని చెప్పారు. హైదరాబాద్ ను అన్ని రకాలుగా అభివృద్ధి పరిచి.. ఎలాంటి అల్లర్లు లేకుండా ఉంచడం ఒక కేసీఆర్ తోనే సాధ్యమన్నారు. గ్రేటర్ లో మూసీ నది సుందరీకరణ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ తీసుకొస్తామన్నారు. మరో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇస్తామని హామీ ఇచ్చారు.