బీజేపీ ఎంపీలు, కేంద్రమంత్రిపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు

బీజేపీ ఎంపీలు, కేంద్రమంత్రిపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన టీఆర్ఎస్ మీటింగ్ లో బీజేపీ ఎంపీలపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కరీంనగర్ కు ట్రిపుల్ ఐటీ, సిరిసిల్లకు మెగా పవర్ లూం క్లస్టర్, వేములవాడకు వెయ్యికోట్లు తేలేని చేతగాని ఎంపీ బండి సంజయ్ అంటూ మండిపడ్డారు. పొద్దున లేస్తే పోటుగాని లాగా మాట్లాడుతారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. కిషన్ రెడ్డి చేతగాని కేంద్ర మంత్రి అంటూ ధ్వజమెత్తారు. మేడారం జాతరకు ముష్టి రెండున్నర కోట్లు తెచ్చిన మొగోడు అంటూ విమర్శలు గుప్పించారు కేటీఆర్. హైదరాబాద్ లో ఐటీఐఆర్ ఎందుకు రద్దైందే కిషన్ రెడ్డి మాట్లాడలేదన్నారు.గుజరాత్ లో వరదలొస్తే డబ్బులు పంపిన కేంద్రం, హైదరాబాద్ లో వరదలొస్తే అరపైసా పంపలేదని ఆరోపించారు. 

నిజామాబాద్ ఎంపీ బాండ్ పేపర్ దొంగ అని దుయ్యబట్టారు కేటీఆర్. పసుపుబోర్డు తెచ్చిస్తననని బాండ్ పేపర్ రాసిచ్చారన్నారు. నిజామాబాద్ ఎంపీ, రేవంత్ రెడ్డి ... కేసీఆర్ పై కుక్కల్లెక్క మాట్లాడుతున్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకుల్లారా.. కేసీఆర్ అనే మూడక్షరాల వ్యక్తే లేకుండా తెలంగాణ ఉంటుండేనా అంటూ ప్రశ్నించారు కేటీఆర్. టీ-బీజేపీ, టీ-కాంగ్రెస్ అనేవీ ఉంటుండేనా? మీ పదవులు కేసీఆర్ వేసిన బిక్షే కదా అన్నారు కేటీఆర్. రేవంత్ అనే హౌలేగాడు, బండి సంజయ్ అనే దివానాగాడు మాట్లాడితే బాధపడేదేమీ లేదన్నారు మంత్రి. ఏపీలో ఉంటే వీళ్లను గంజిలో ఈగలాగా తీసేసేటోళ్లన్నారు. 

మన కార్యకర్తలంతా ఇకపై శివంగులపై ప్రతిపక్షాలపై గర్జించాలన్నారు. ప్రతి ఊరిలో చేసిన పనులపై ఫ్లెక్సీలు పెడదామన్నారు. ఒక ఊరిలో 500 మంది ఫించన్ తీసుకున్నోళ్లు సైలెంటుగా ఉంటుంటే... ఫించన్ రాని 10 మంది ఉంటే వాళ్లు గాయి గాయి చేస్తున్నారన్నారు. 
ప్రతిపక్షాలు తెల్లటి గోడపై చిన్నటి నల్ల మచ్చ ఉంటే దాన్నే ఎత్తి చూపిస్తున్నారన్నారు. 

ఇవి కూడా చదవండి: 

2కోట్ల మంది టీనేజర్లకు రెండు డోసుల వ్యాక్సిన్

హరితహారం మొక్కలు మేసిన మేక.. యజమానికి రూ.1500 జరిమానా