రేపు కరీంనగర్లో మంత్రి కేటీఆర్ పర్యటన

రేపు కరీంనగర్లో మంత్రి కేటీఆర్ పర్యటన

కరీంనగర్: పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రేపు కరీంనగర్ జిల్లాలో పర్యటన పర్యటించనున్నారు.  పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనతో పాటు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉదయం 10.30 గంటలకు కరీంనగర్ చేరుకోనున్న కేటీఆర్ 11గంటలకు మానేరు వంతనపై భగీరథ వాటర్ పైలాన్ ప్రారంభించనున్నారు. అనంతరం మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. బీసీ స్టడీ సర్కిల్ను కూడా కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఉదయం 11.30 గంటలకు నగరంలోని మార్క్ ఫెడ్ గ్రౌండ్ లో నగరపాలక సంస్థ, స్మార్ట్ సిటీకి సంబంధించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. 

మధ్యాహ్నం ఒంటిగంటకు చొప్పదండికి వెళ్లనున్న మంత్రి కేటీఆర్.. అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం 4గంటలకు తిరిగి కరీంనగర్ చేరుకుని ఉజ్వల పార్కు వద్దనున్న ఐటీ టవర్లో జిల్లా మున్సిపల్ అధికారులు, జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.  

మరిన్ని వార్తల కోసం..

జపాన్లో 7.3 తీవ్రతతో భారీ భూకంపం

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారిగా వికాస్ రాజ్