రాహుల్ గాంధీ పాదయాత్రపై కేటీఆర్ సెటైర్ 

రాహుల్ గాంధీ పాదయాత్రపై కేటీఆర్ సెటైర్ 

హైదరాబాద్ : ‘భారత్ జోడో యాత్ర’ చేపట్టిన రాహుల్ గాంధీపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో సెటైర్ వేశారు. ‘అమేథీలో సొంత పార్లమెంటు సీటును కూడా గెలవలేని అంతర్జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ.. తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఆశయాలను అపహాస్యం చేశారు. దేశ ప్రధానిగా కావాలని కలలుగంటున్న రాహుల్.. ముందుగా ప్రజలచే ఎంపీగా ఎన్నుకునేలా ఒప్పించాలి’ అంటూ ట్విట్టర్ లో విమర్శ చేశారు.

హైదరాబాద్ కు చేరుకున్న పాదయాత్ర

రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ఇవాళ హైదరాబాద్ కు చేరుకుంది. కాలేజీ విద్యార్థులతో కలిసి రాహుల్ శంషాబాద్ నుంచి పాదయాత్ర చేస్తున్నారు. శంషాబాద్ వద్ద ప్రారంభమైన భారత్ జోడో యాత్ర.. ఆరాంఘర్, బహదూర్ పురా, పురానాపూల్, హుస్సేనీ ఆలం, లాడ్ బజార్, చార్మినార్, మదీన, గాంధీభవన్ మీదుగా నెక్లెస్ రోడ్డుకు చేరుకోనుంది. రాహుల్ గాంధీ రాక కోసం ఆరాంఘర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో అక్కడ బహిరంగ సభలో పాల్గొననున్న రాహుల్ గాంధీ.. చార్మినార్ వద్ద జాతీయ జెండాను ఎగురవేయనున్నారు.