హైదరాబాద్ : టెక్స్టైల్ పరిశ్రమపై జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయం వస్త్ర పరిశ్రమకు మరణశాసనమని అన్నారు. టెక్స్ టైల్ పై జీఎస్టీని 5 నుంచి 12 శాతానికి పెంచడం సరికాదని కేటీఆర్ ట్వీట్ చేశారు. మేకిన్ ఇండియా అని ఉపన్యాసాలు ఇచ్చే మోడీ వస్త్ర పరిశ్రమను మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. స్వదేశంలో వస్త్ర తయారీకి సహకారం అందించాలని కోరారు. ఈ విషయంలో మోడీ జోక్యం చేసుకుని చేనేత కార్మికులను కాపాడాలని అన్నారు.
మగ్గంపై పిడుగు? వస్త్ర పరిశ్రమపై #GST బాదుడు
— KTR (@KTRTRS) December 24, 2021
మేకిన్ ఇండియా అంటూ రోజు ఉపన్యాసాలు ఇచ్చే కేంద్రం… స్వదేశంలో వస్త్రాలు తయారు వస్త్ర పరిశ్రమకు సహకారం అదించాల్సింది పోయి… 5% ఉన్న GSTని 12% కి పెంచి పరిశ్రమకు మరణ శాసనం రాస్తుంది#Handlooms #Telangana #ReviseGSTonHandlooms pic.twitter.com/tPI6Kc0IPp
మరిన్ని వార్తల కోసం
వ్యాపారి ఇంట్లో ఐటీ సోదాలు.. రూ.150 కోట్లు స్వాధీనం
మరో రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ