తెలంగాణలో మున్సిపాలిటీలు దేశానికే ఆదర్శం: మంత్రి కేటీఆర్

తెలంగాణలో మున్సిపాలిటీలు దేశానికే ఆదర్శం: మంత్రి కేటీఆర్

అన్ని రంగాల్లో సిరిసిల్ల అభివృద్ధి చెందుతోందన్నారు మంత్రి కేటీఆర్. వివిధ పథకాల ద్వారా నేతన్నకు అండగా నిలుస్తున్నామని.. మరమగ్గాల కార్మికులకు నేతన్న బీమా అమలు చేస్తున్నమని తెలిపారు. దేశవ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన స్వచ సర్వేక్షణ్ గ్రామీణ్ 2023 సర్వేలో పారిశుధ్య విభాగంలో తెలంగాణాకు ఫైవ్ స్టార్ రేటింగ్ వచ్చిందని.. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. సిరిసిల్లా జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో జాతీయ జెండాను మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతన్నల సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్నారన్నారు.

ALSO READ :ఇండిపెండెన్స్ డే స్పెషల్గా..హృతిక్ రోషన్ ఫైటర్ మోషన్ పోస్టర్ రిలీజ్

దేశంలోనే వ్యవసాయరంగంతో పాటు.. అన్ని రంగాలకు 24 గంటల కరెంటు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. దుక్కి దున్నిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొంటోందని.. గత ప్రభుత్వాలు 200 వందల పెన్షన్ ఇస్తే సీఎం కేసీఆర్ రూ. 2016, వికలాంగులకు 4016 ఇస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హర్ ఘర్ జల్ యోజన పథకం ప్రారంభించామన్నారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా గురుకులాలు ఏర్పాటు చేశామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

అమ్మ ఒడి వాహనం, ఆరోగ్య లక్ష్మి వంటి పథకాలను నీతి అయోగ్ అభినందించిందని మంత్రి కేటీఆర్‌ వివరించారు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానా అనే నినాదం నుంచి.. ఛలో పోదాం పదరా సర్కారు దవాఖానాకు అనేలా రోగులకు తెలంగాణ ప్రభుత్వం భరోసానిచ్చిందన్నారు. గురుకులాల్లో చదివే విద్యార్థులపై 1 లక్షా 25 వేలు ఖర్చు చేస్తున్నామని మంత్రి చెప్పారు.