కేసీఆర్ కు పాలాభిషేకం... యువతకు ఉద్యోగాలు

కేసీఆర్ కు పాలాభిషేకం... యువతకు ఉద్యోగాలు

తెలంగాణలోని 33 జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో సీఎం కేసీఆర్ కు  కృతజ్ఞతలు చెప్పారు మంత్రి మల్లారెడ్డి. బోయిన్ పల్లిలోని తన ఆఫీస్ వద్ద కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా స్థానికంగా ఉండే యువతకు 95 శాతం ఉద్యోగులు లభిస్తాయన్నారు..మేడ్చల్ జిల్లాలో అధికంగా కంపెనీలు ఉన్నాయని ఆ కంపెనీలల్లో 95 శాతం ఉద్యోగాలు వస్తాయన్నారు. అదేవిధంగా సీఎం కేసీఆర్ త్వరగా కరోనా నుండి కోలుకోవాలని  ప్రార్ధిస్తున్నట్లు చెప్పారు.