మూడోసారి బీఆర్ఎస్​దే అధికారం : మంత్రి నిరంజన్​రెడ్డి

మూడోసారి బీఆర్ఎస్​దే అధికారం : మంత్రి నిరంజన్​రెడ్డి

వనపర్తి, వెలుగు : రాష్ట్ర ప్రజలంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారని, మూడోసారి కేసీఆర్  సీఎం అవుతారని మంత్రి నిరంజన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఖిల్లా ఘనపురం మండల కేంద్రంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్  విజయాన్ని ఏ శక్తి అడ్డుకోలేదని చెప్పారు. కరువుకు కాంగ్రెస్  పార్టీ ప్రత్యామ్నాయ పదమని, వారిని ప్రజలు ఎప్పటికీ నమ్మరని చెప్పారు. కరెంట్ కోతలు, యూరియా, డీజిల్  కోసం లైన్లలో నిలబడి ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారని, మళ్లీ ఆ రోజులు రావన్నారు.

సాగునీటి వనరులను అభివృద్ధి చేసి ప్రతి ఎకరాకు నీరందించామని తెలిపారు. నిజాలాపూర్, మహ్మద్​హుస్సేన్ పూర్  మధ్య రోడ్ ను బీటీగా మార్చేందుకు రూ.3.30 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. నియోజకవర్గంలో ఇప్పటికే 100 మందికి దళితబంధు ఇచ్చామని, రెండో విడతలో 1000 మందికి ఇస్తామన్నారు. కృష్ణనాయక్, లక్ష్మారెడ్డి, బాలీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.