కేసీఆర్ ఆరేళ్ల పాలన దేశానికే ఆదర్శం

కేసీఆర్ ఆరేళ్ల పాలన దేశానికే ఆదర్శం

రాష్ట్రంలో రైతుల అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలను చూసే దేశంలోని రైతుల కోసం కేంద్రం ప్రభుత్వం అనుసరించిందన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. గడిచిన 6 సంవత్సరాల పాలనలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఆదివారం హైదరాబాద్  అబిడ్స్ లోని రెడ్డి హాస్టల్ లో తెలంగాణ వ్యవసాయ శాఖ అధికారుల డైరీ,  క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. వాటి ఆవిష్కరణ అనంతరం మంత్రి పలువురు రైతులకు  రైతు రత్న 2019  పురస్కారాలను అందజేశారు.

ఈ  కార్యక్రమంలో నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు కోసం సూక్ష్మంగా ఆలోచన చేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమన్నారు. వారి అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఆనేక కార్యక్రమాలు చేశారని, ప్రాజెక్ట్ లు నిర్మించి వ్యవసాయానికి సాగునీరు అందిస్తున్నారన్నారు. వ్యవసాయ శాఖ అధికారుల సమస్యలు సంవత్సరం లోపల పరిష్కరిస్తానని ఈ కార్యక్రమంలో తెలిపారు నిరంజన్ రెడ్డి. రైతు రత్న అవార్డ్స్ అందుకున్న రైతులకు అభినందనలు తెలిపారు.