తప్పు మాట్లాడితే సజీవ దహనానికి సిద్ధం : పొన్నం ప్రభాకర్​

తప్పు మాట్లాడితే సజీవ దహనానికి సిద్ధం :  పొన్నం ప్రభాకర్​

వేములవాడ, వెలుగు: రామ జన్మభూమి విషయంలో తప్పు మాట్లాడితే తాను సజీవ దహనానికి సిద్ధమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ‘‘రాజకీయాల్లోకి మా అమ్మ ప్రస్తావన ఎందుకు తీసుకువచ్చావ్.. మా అమ్మ మనసు క్షోభిస్తుందని హుస్నాబాద్​లో అంబేద్కర్ విగ్రహం వద్ద అన్నదెవరు? మళ్లీ అలా అనలేదని మా అమ్మ కాళ్లు మొక్కుతా అంటున్నావ్” అంటూ ఎంపీ బండి సంజయ్​పై ఆయన ఫైర్​అయ్యారు. 

బుధవారం వేములవాడ అర్భన్​ మండలం కొడుముంజలో ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి ప్రభుత్వ విప్​ఆది శ్రీనివాస్​తో కలిసి పొన్నం భూమి పూజ చేశారు. తర్వాత నాంపల్లి శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంజయ్ మాత్రమే కాదని, తాను కూడా హిందువునే అని అన్నారు. నాయకులు రాజకీయాలు మాట్లాడాలని, కుటుంబసభ్యుల గురించి మాట్లాడడం ఏమిటన్నారు.