యాదాద్రి ఆలయానికి బంగారం విరాళం ఇచ్చిన పువ్వాడ

యాదాద్రి ఆలయానికి బంగారం విరాళం ఇచ్చిన పువ్వాడ

ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా నర్సన్నకు కిలో బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. యాదాద్రి ఆలయ గోపురం స్వర్ణ తాపడం కోసం ఖమ్మం జిల్లా ప్రజల తరఫున బంగారాన్ని అందజేసినట్లు చెప్పారు. లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న అనంతరం ఎమ్మెల్యే అజయ్ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. పువ్వాడకు సీఎం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.