
- ఎంపీలు బలరాం నాయక్, గోడం నగేశ్తో కలిసి కాంపౌండ్ వాల్ కు శంకుస్థాపన
ములుగు, వెలుగు: ములుగు సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ పనులు స్పీడప్చేయాలని మంత్రి సీతక్క సూచించారు. ఆదివారం ములుగులోని గట్టమ్మ సమీపంలో యూనివర్సిటీకి కేటాయించిన 337ఎకరాల స్థలం చుట్టూ రూ.24 కోట్లతో నిర్మించనున్న 8.4 కిలోమీటర్ల కాంపౌండ్వాల్కు ఆదివారం ఆదిలాబాద్, మహబూబాబాద్ ఎంపీలు గోడం నగేశ్, పోరిక బలరాం నాయక్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, కలెక్టర్ దివాకర టీఎస్, వీసీ ఎల్ శ్రీనివాస్తో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ కాంపౌండ్ వాల్ నిర్మాణం పూర్తి కాగానే, యూనివర్సిటీ బల్డింగ్లకు ప్రధాని, సీఎం, కేంద్ర, రాష్ట్ర మంత్రులు శంకుస్థాపన చేస్తారన్నారు. యూనివర్సిటీ నిర్మాణం పూర్తయితే ములుగుకు జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందని తెలిపారు. ఎంపీలు బలరాం నాయక్, నగేశ్ మాట్లాడుతూ కేంద్రం సహకరించేలా పార్లమెంట్లో చర్చిస్తామని, రిజర్వేషన్ పెంచేందుకు కృషి చేస్తామని తెలిపారు. లైబ్రరీ చైర్మన్ బానోత్ రవిచందర్, ఏఎంసీ చైర్మన్ రేగా కల్యాణి, నోడల్ ఆఫీసర్ వంశీ పాల్గొన్నారు.