
హైదరాబాద్: అన్ని రంగాల్లో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ గా నిలుపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని బాబు అన్నారు ఐటీ మంత్రి దుద్దీళ్ల శ్రీధర్. గత ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యలు ఉండవని.. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నడుపుతామన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి డిసెంబర్ 17వ తేదీ ఆదివారం పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గానికి చేరుకున్న శ్రీధర్ బాబుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం అందరిని కలుపుకుని ముందుకు వెళ్తుందన్నారు.
గత ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలు బాగుంటే వాటిని కూడా కొనసాగిస్తామని ఆయన చెప్పారు. యువతకు ఉద్యోగ కల్పన దిశగా చర్యలు చేపట్టామని.. టీఎస్ పీఎస్సీ ఆధ్వర్యంలో ఏటా జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని తెలిపారు. తెలంగాణలో అన్ని వర్గాల వారి సంక్షేమం కోసం బడ్జెట్ రూపొందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
అంతకుముందు ఆర్ బిఐ మాజీ గవర్నర్ రఘురాంరాజన్ తో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టీ విక్రమార్కతోపాటు మంత్రి శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి అంశాలపై చర్చించారు.