కేంద్రం ఆదేశించిందని ప్రాజెక్టులు ఆపం

కేంద్రం ఆదేశించిందని ప్రాజెక్టులు ఆపం

కేంద్ర ప్రభుత్వం ఆదేశించినంత మాత్రాన రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణాలు ఆపబోమని మంత్రి శ్రీనివాస్‌‌గౌడ్ ‌అన్నారు. కేంద్రం చెప్తే ఏపీ తన ప్రాజెక్టులను ఆపలేదని.. మరి రాష్ట్ర సర్కారు ఎందుకు ఆపాలని పేర్కొన్నా రు. ఏపీ చేపట్టిన
ప్రాజెక్టును సుప్రీంకోర్టులో ఆపవచ్చనే పిటిషన్ వేశామన్నారు. అపెక్స్‌‌కమిటీ కంటే ముందు కోర్టు ఉత్తర్వులు వచ్చేలా ప్రయత్నం చేస్తున్నామని.. రెండు, మూడు రోజుల్లోనే సుప్రీం నుంచి ఆదేశాలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు.
శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్‌‌లో ప్రభుత్వ విప్‌‌గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు సి.లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌‌రెడ్డితో కలిసి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. రాయల సీమ లిఫ్ట్‌‌స్కీంపై సుప్రీంకోర్టులో గతంలో వేసిన
పిటిషన్పైనే ఆర్‌‌ఏ వేశామని.. అందులో కర్నాటక, మహారాష్ట్ర గురించి ఎక్కడా ప్రస్తావించలేదని చెప్పారు. అపెక్స్‌‌కౌన్సిల్‌‌ కన్నా సుప్రీంకోర్టుకు పోతెనే ఏపీ ప్రాజెక్టును ఆపవచ్చని పిటిషన్‌ వేశామన్నారు. గతంలోనూ కేంద్రం ఆదేశాలను ఏపీ పట్టించుకోలేదని, ఇప్పుడు అపెక్స్ ‌‌కౌన్సిల్ ‌ఆదేశాలను పరిగణనలోకి తీసుకుంటుందని ఎలా అనుకోవాలని ప్రశ్నించారు.

తెలంగాణ గురించి కొట్లాడేది మేమే..

రాయలసీమ ఎత్తిపోతల పథకంతో దక్షిణ తెలంగాణకు అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్‌‌ నేతలు మాట్లాడటం ఏమిటని శ్రీనివాస్ గౌడ్ ఎగతాళి చేశారు. పోతిరెడ్డి పాడు కెపాసిటీని పెంచింది ఆ పార్టీ హయాంలోనేనని, మరి అప్పుడేం చేశారని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచి తేనే అప్పట్లో వైఎస్‌ ‌సర్కారు నుంచి టీఆర్‌‌ఎస్‌‌బయటికి వచ్చిందన్నారు. రాయలసీమ లిఫ్ట్స్ స్కీం ను ఆపాలనే సుప్రీంలో కేసు వేశామని, న్యాయ నిపుణుల సలహాతోనే
ముందు కు వెళ్తున్నామని చెప్పారు. కాంగ్రెస్‌‌ నేతలు కోర్టు ప్రొసీజర్‌ ‌తెలుసుకొని మాట్లాడాలని విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాల గురించి కొట్లాడే పార్టీ టీఆర్‌‌ఎస్ ‌‌ఒక్కటేనన్నారు. టీఎంసీ అంటే తెలియని నేతలు కూడా కృష్ణా
నీళ్ల గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జల వివాదాల చట్టం ప్రకారం కేంద్రం జోక్యం చేసుకోవాల్సి ఉన్నా సరిగా స్పందించడం లేదని విమర్శించారు. పాలమూరు అంటే కేసీఆర్‌‌కు ఎంతో ఇష్టమని.. ఏపీ వినకపోతే ఏం చేయాలో
తమ ప్రభుత్వానికి బాగా తెలుసని, చేసి చూపిస్తామని పేర్కొన్నా రు. ఏపీ ప్రాజెక్టుపనులు మొదలు పెడితే సీఎం రాజీనామా చేయాలనడం హాస్యాస్పదమని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ఆర్డీఎర్డీ స్‌‌కు, ఆర్డీఎక్ర్డీ స్‌‌కు తేడా తెలియని వాళ్లు ఇరిగేషన్‌ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు.