
మహబూబ్ నగర్, వెలుగు: పాలమూరు జిల్లా ఉపాధి అవకాశాలకు అడ్డాగా మారిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జడ్పీ గ్రౌండ్లో ఆదివారం ఉదయం మెగా జాబ్ మేళా నిర్వహించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ చీఫ్ గెస్ట్గా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. మేళాలో 62 కంపెనీలు పాల్గొన్నాయి. 5,286 మంది నిరుద్యోగులు హాజరు కాగా 2015 మందికి ఉద్యోగాలు దక్కాయి. అనంతరం మంత్రి మాట్లాడుతూ మేళా ద్వారా ప్రస్తుతం భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన జాబితా ఆఫీసర్లు సిద్ధం చేయాలని చెప్పారు. మేళాకు హాజరై ఉద్యోగాలు రాని వారి వివరాలతో మరో జాబితా రెడీ చేసి అందించాలని ఆదేశించారు. ఈ జాబితా ఆధారంగా వారికి నైపుణ్య శిక్షణ అందిస్తామని ప్రకటించారు. భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సాధించేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.