వానలు తగ్గాలంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వరుణ యాగం చేశారు. సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో వరుణ శాంతి యాగం నిర్వహించారు. యాగానికి సంబంధించిన ఫోటోలను, దృశ్యాలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు వరుణ దేవుడు శాంతించి వానలు తగ్గాలని సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయని మహంకాళి ఆలయంలో నిర్వహించిన వరుణ శాంతి యాగంలో పాల్గొనడం జరిగింది” అని ట్వీట్ లో పేర్కొన్నారు.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారి ఆదేశాల మేరకు వరుణదేవుడు శాంతించి వర్షాలు తగ్గాలి అని సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో నిర్వహించిన వరుణ శాంతి యాగంలో పాల్గొనడం జరిగింది. pic.twitter.com/mybOe0ulhr
— Talasani Srinivas Yadav (@YadavTalasani) July 14, 2022
ఈ నెల 17న మహంకాలి అమ్మవారి జాతర సందర్భంగా ఆలయంలో మగ్గంపై చీర తయారీని మంత్రి శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. స్వయంగా మగ్గం నేశారు.
జులై 17వ తేదీన తేదీన అంగరంగ వైభవంగా నిర్వహించనున్న శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల సందర్భంగా సమర్పించే నూతన చీర తయారీ పనులను ఆలయ ఆవరణలో ప్రారంభించడం జరిగింది. pic.twitter.com/X477zSoaVB
— Talasani Srinivas Yadav (@YadavTalasani) July 14, 2022
ఆ తర్వాత లష్కర్ బోనాల సందర్భంగా వివిధ ఆలయాలకు ప్రభుత్వం అందించే ఆర్ధిక సహాయం చెక్కుల ఆయన పంపిణీ చేశారు. అంతకుముందు సికింద్రాబాద్ బోనాల ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.
Handed over cheques worth Rs 76,20,000 to the 91 temple committees pertaining to Sanathnagar Assembly Constituency. The State Govt has sanctioned Rs 15 crore ahead of Bonalu festival to temples located in GHMC limits to make adequate arrangements for festival celebrations. pic.twitter.com/uVZuvxCKmp
— Talasani Srinivas Yadav (@YadavTalasani) July 14, 2022