వరుణుడు శాంతించాలని మంత్రి తలసాని యాగం

వరుణుడు శాంతించాలని మంత్రి తలసాని యాగం

వానలు తగ్గాలంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వరుణ యాగం చేశారు. సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో వరుణ శాంతి యాగం నిర్వహించారు. యాగానికి సంబంధించిన ఫోటోలను, దృశ్యాలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.  గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు వరుణ దేవుడు శాంతించి వానలు తగ్గాలని సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయని మహంకాళి ఆలయంలో నిర్వహించిన వరుణ శాంతి యాగంలో పాల్గొనడం జరిగింది” అని ట్వీట్ లో పేర్కొన్నారు. 

ఈ నెల 17న మహంకాలి అమ్మవారి జాతర సందర్భంగా ఆలయంలో మగ్గంపై చీర తయారీని మంత్రి శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. స్వయంగా మగ్గం నేశారు.

ఆ తర్వాత లష్కర్ బోనాల సందర్భంగా వివిధ ఆలయాలకు ప్రభుత్వం అందించే ఆర్ధిక సహాయం చెక్కుల ఆయన పంపిణీ చేశారు. అంతకుముందు సికింద్రాబాద్ బోనాల ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.