మంత్రిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ బాధ్యతలు

మంత్రిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ బాధ్యతలు

హైదరాబాద్ : రాష్ట్ర పశుసంవర్ధక, మత్య్సశాఖ, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇవాళ సెక్రటేరియట్ లో బాధ్యతలు తీసుకున్నారు. సాంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. 2019-20 సంవత్సరంలో 80.69 కోట్ల చేప పిల్లల విడుదలకు సంబంధించిన ఫైల్ పై మొదటి సంతకం చేశారు తలసాని. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు మంత్రికి అభినందనలు తెలిపారు.