
హైదరాబాద్: కరోనా కట్టడి మీద మీడియా అడిగిన ప్రశ్నలపై అసహనం వ్యక్తం చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్. అన్నపూర్ణ భోజనం ఫ్రీ గా ఇస్తున్నారా లేదా 5 రూపాయలకు ఇస్తున్నారా అంటే ఆయన సమాధానం చెప్పలేకపోయారు. హైదరాబాద్ లో కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలపై జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రివ్యూ నిర్వహించిన తర్వాత మీడియాతో మాట్లాడారు తలసాని. ఫీవర్ సర్వే ఎన్ని ఏరియాల్లో పూర్తయింది..? ఎంత మందిలో లక్షణాలు బయటపడ్డాయని అడిగితే ఆయన స్పష్టంగా సమాధానం చెప్పలేదు.
ఫీవర్ సర్వే వేగంగా జరుగుతోందని చెప్పారు. అన్నపూర్ణ కేంద్రాలను 200 వరకు పెంచుతున్నామని తెలిపారు. ఆన్ లైన్ విధానములో ఇబ్బందుల వల్లే వ్యాక్సినేషన్ లో కష్టాలు వస్తున్నాయన్నారు. కరోనా కష్టకాలంలో రాజకీయాలు చేయొద్దన్నారు తలసాని. ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సహకారం అందించాలని, లేకుంటే సైలెంట్ ఉండాలని ఫైర్ అయ్యారు.