రహదారులతోనే అభివృద్ధి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

రహదారులతోనే అభివృద్ధి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  • మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 
  • రఘునాథపాలెం మండలంలో బీటీ రోడ్డుకు శంకుస్ధాపన 

ఖమ్మం టౌన్, వెలుగు : రహదారులతోనే అభివృద్ధి వేగంగా జరుగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం రఘునాథపాలెం మండలంలో మంచుకొండ నుంచి శివాయిగూడెం వరకు రూ.3.70 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున పుట్టింటి సారే మాదిరి ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. 

రాష్ట్రంలో కోటి మంది మహిళలకు ఇంటింటికి వెళ్లి, చీర అందజేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పన ప్రభుత్వం బాధ్యత అన్నారు. చీడ పీడలు, కోతుల బెడద లేని ఆయిల్​ పామ్​ సాగు చేపట్టాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, పీఆర్ ఎస్ఈ వెంకట్ రెడ్డి, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, మిషన్ భగీరథ ఈఈలు పుష్పలత, వాణిశ్రీ, ఎలక్ట్రిసిటీ డీఈ రామారావు, మండల తహసీల్దార్ శ్వేత, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.