ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి చేస్తం : మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి చేస్తం :  మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి
  •     మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హామీ

గుడిహత్నూర్, వెలుగు: ఆదిలాబాద్‌ జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టులను త్వరలోనే పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదిలాబాద్‌ డీసీసీ ప్రెసిడెంట్‌ నరేశ్‌ జాదవ్‌ శనివారం హైదరాబాద్‌లో మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితిని మంత్రికి వివరించారు. 

కుప్టి, చనాక-కొరాట ప్రాజెక్టుల నిర్మాణ పనులకు నిధుల మంజూరు, పనులు స్పీడప్ చేయాలని వినతిపత్రం అందజేశారు. స్పందించిన మంత్రి పెండింగ్‌ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి, యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చినట్లు నరేశ్​జాదవ్​తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ సంజీవరెడ్డి ఉన్నారు.