
బషీర్బాగ్, వెలుగు: తెలంగాణలో అతిపెద్ద రన్ అయినటువంటి ఎన్ఎండీసీ మారథాన్లో పాల్గొన్న వారిని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్వెంకటస్వామి అభినందించారు. 42 కిలోమీటర్లు రన్ పూర్తి చేసిన శాంతివనం రన్నర్స్ మంచిర్యాల జిల్లా ఇందారం గ్రామం చెందిన హరికే సంతోశ్ ఆధ్వర్యంలో వివేక్ వెంకటస్వామిని సోమాజిగూడలోని ఆయన నివాసంలో కలిసి హైదరాబాద్ మారథాన్ గురించి వివరించారు. ఈ సందర్భంగా మారథాన్ రన్ లో పాల్గొన్న బోడుప్పల్, మేడిపల్లి శాంతివనం రన్నర్స్ సభ్యులు కట్ట శేఖర్, సోము పటేల్, సంతోశ్ ను మంత్రి సన్మానించారు.