కోల్బెల్ట్/చెన్నూరు/జైపూర్/కోటపల్లి,వెలుగు: రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తున్న రాష్ట్ర మైనింగ్, కార్మికశాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి రాజకీయంగా ఉన్నత పదవులను అధిరోహించాలని మంచిర్యాల జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ పిన్నింటి రఘునాథ్రెడ్డి, కాంగ్రెస్ లీడర్లు పేర్కొన్నారు.
ఆదివారం రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి 68వ బర్త్డేను మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు,అభిమానులు, కళాకారులు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వాసులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా లీడర్లు మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు చేసి ప్రత్యేక రాష్ట్రం రావడానికి కీలక పాత్ర పోషించిన మంత్రి వివేక్ వెంకటస్వామి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు సేవ చేసే అవకాశం ఆ దేవుడు కల్పించాలని కోరారు.
కాకా ప్రజలకు ఎన్నో సేవలను అందించారని,తండ్రి బాటలో వివేక్ వెంకటస్వామి ప్రజలకు అండగా నిలుస్తారని పేర్కొన్నారు. చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తున్నారని కొనియాడారు.వివేక్ వెంకటస్వామి ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుణ్ణి వేడుకున్నారు.
మంత్రి వివేక్ బర్త్డే సందర్భంగా మందమర్రి,క్యాతనపల్లి,రామకృష్ణాపూర్,చెన్నూరు,భీమారం,జైపూర్,కోటపల్లి,మంచిర్యాల జిల్లా కేంద్రం,మంచిర్యాల-నస్పూర్ మండలాల్లోని గ్రామాలు,మున్సిపాలిటీ,మండల కేంద్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు కేక్లు కట్ చేసి సంబురాలు జరిపారు.స్వెట్టర్లు,దుప్పట్లు,చీరల పంపిణి,మోగా బ్లడ్ డోనేషన్ల క్యాంపులు,అన్నదానాలు, పండ్ల పంపిణి చేపట్టారు.ఆలయాలు,చర్చిలు,దర్గాల్లో మంత్రి వివేక్ పేరిట పూజలు,ప్రార్ధనలు నిర్వహించారు.
పలు వేడుకల్లో మంచిర్యాల డీసీసీ ప్రెసిడెంట్ పిన్నింటి రాఘునాథ్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాయిలింగి గ్రామంలోని సాయి వృద్ధాశ్రమంలో మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కొప్పుల రమేష్ అన్నదానం చేశారు.
