సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తా: మంత్రి వివేక్ వెంకటస్వామి

సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తా: మంత్రి వివేక్ వెంకటస్వామి

కోల్ బెల్ట్ : సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తామని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్వెంకటస్వామి అన్నారు. జూన్  15న  మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బీ 1 గెస్ట్ హౌస్ లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంత్రి వివేక్ వెంకటస్వామికి ఆత్మీయ సన్మానం నిర్వ హించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. దివంగత నేత కాకా వెంకటస్వామి కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పరితపించేవారని చెప్పారు. గత ప్రభుత్వం సింగరేణి అభివృద్ధికి పాటు పడలేదన్నారు. కేంద్రప్రభుత్వం బొగ్గు గనుల యాక్షన్ లో పాల్గొనాలని సూచిస్తే.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం  మైన్ అలాంట్  మెంట్ కు  ప్రాధాన్యత ఇచ్చిందన్నా రు. తెలంగాణ లోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి సంస్థ. సింగరేణి సంస్థ పైనే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం అభివృ ద్ధి చెందుతుంది.

 రూ.100 కోట్లతో చెన్నూరు నియోజక వర్గంలో అభివృద్ధి పనులు జరుగు తున్నాయంటే సింగరేణి డీఎంఎల్టీ, సీఎస్ ఆర్ నిధులతోనే. సింగరేణి సంస్థ ను మనం కాపాడుకంటే మనకు భవిష్యత్తు. కొత్తగనులు రాకుండా చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఒరిస్సాలో సింగరేణి సంస్థ ఓపెన్ యాక్షన్ లో పాల్గొని గనులు దక్కించుకుంది. కొత్తగనులు రావాలంటే సింగరేణి సంస్థ ఓపెన్ యాక్షన్ లో పాల్గొనాలి. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న

ప్రజా పాలనలో సుమ ఇందిరమ్మ ఇంతీరుతో సింగరేణి సంస్థ తీవ్రంగా నష్టపోతుం ది. కొత్త గనులు రావాలి.. ఉత్పత్తి పెంచాలి.. కొత్త ఉద్యోగాలు సాధించాలి.' అని వివేక్వెం కటస్వామి అన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్య క్షుడు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ.. కాకా ఫ్యామిలీ అంటేనే గౌరవగల కుటుంబ మన్నారు. పెన్షన్ విధానాన్ని తీసుకువచ్చిన ఘనత కాకా వెంకటస్వామికి దక్కుతుందన్నారు. సింగరేణి సంస్థ ఉన్నంత కాలం కాక పేరు మర్చిపోదన్నారు. సింగరేణి కార్మికులు ఇన్ కాంట్రాక్సీ తగ్గించాలన్నారు. అనంతరం మంత్రి వివేక్ కు మాజీ ఎమ్మెల్సీ వెంకట్ రావు, పలువురు ఏఐటీయూసీ నాయకులు పూలబొకే అందించి ఘనంగా సత్కరించారు.