కోల్ బెల్ట్, వెలుగు: రాష్ట్రంలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం కష్టపడి పనిచేయాలని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్వెంకటస్వామి,పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సూచించారు. మంచిర్యాల డీసీసీ ప్రెసిడెంట్గా ఎన్నికైన పిన్నింటి రఘునాథ్రెడ్డి మంగళవారం హైదరాబాద్లో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి మంత్రి, ఎంపీని కలిశారు. వారికి బొకేలు అందజేసి సన్మానించారు.
స్వీట్లు పంచుకున్నారు. తనకు డీసీసీ ప్రెసిడెంట్ పదవిని వచ్చేలా కృషి చేసిన వారికి రఘునాథ్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతం, బూత్స్థాయి నిర్మాణం జరిగేలా పార్టీ శ్రేణులను సమన్వయం చేయాలని డీసీసీ ప్రెసిడెంట్కు అనంతరం మంత్రి, ఎంపీ సూచించారు. ప్రజల సమస్యలు పరిష్కరించాలని, యువతకు అవకాశాలు కల్పించాలని, కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని రఘునాథ్రెడ్డి తెలిపారు.
