మెదక్ టౌన్, వెలుగు: జిల్లాలో స్వాతంత్ర్య వేడుకలకు చీఫ్గెస్ట్గా జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి రానున్నారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని సూచించింది.
మెదక్లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకావిష్కరణ, గౌరవ వందనం, సాంస్కృతిక ప్రదర్శనలు, విశిష్ట సేవలకు గానూ అధికారులకు పురస్కారాల ప్రదానం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
