న్యూఢిల్లీ: ఎడ్టెక్ స్టార్టప్ బైజూస్ చిక్కుల్లో పడింది. ఖాతా పుస్తకాలను తనిఖీ చేయాలని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించింది ఆరు వారాల్లో నివేదికను ఇవ్వాలని కోరింది. ఇటీవల ముగ్గురు బోర్డు సభ్యులు, ఆడిటర్ సంస్థను వీడటం, అప్పులు చెల్లింపు ఆలస్యం కావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. నివేదికలోని విషయాల ఆధారంగా తదుపరి విచారణను సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్కు అప్పగించాలా వద్దా ? అనే విషయాన్ని నిర్ణయిస్తుంది.
దర్యాప్తు గురించి ఎంసీఏ నుండి కంపెనీకి ఇంకా ఎలాంటి కమ్యూనికేషన్ అందలేదని బైజూస్కు సలహా ఇస్తున్న ఒక న్యాయ సంస్థ తెలిపింది. ఈ విషయమై స్పందన కోసం చేసిన రిక్వెస్టులకు మంత్రిత్వ శాఖ వెంటనే స్పందించలేదు. బైజూస్ 2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తన ఆర్థిక నివేదికలను ఇంకా సమర్పించలేదు. జాతీయ పెన్షన్ ఫండ్కు బకాయిలు చెల్లించలేకపోవడంతో ఈ ఎడ్టెక్ కంపెనీకి ఇబ్బందులు పెరుగుతున్నాయి. బైజూస్విదేశీ మారకపు చట్టాలను ఉల్లంఘించిందనే ఆరోపణలూ ఉన్నాయి.