పోలీస్ స్టేషన్ నుంచి మైనర్​ ఎస్కేప్

పోలీస్ స్టేషన్ నుంచి మైనర్​ ఎస్కేప్

వరంగల్​ సిటీ, వెలుగు: వరంగల్ జిల్లా కేంద్రంలోని మట్వాడ  పోలీస్​స్టేషన్ ​నుంచి మైనర్​ దొంగ పారిపోయాడు. పోతూ.. పోతూ.. ఇద్దరు కానిస్టేబుల్స్ కు చెందిన సెల్ ఫోన్లు, పర్సులను ఎత్తుకెళ్లినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నెల కింద సిటీలోని ఓ షాపులో రూ.5లక్షలు చోరీ జరగగా, 2 రోజుల కింద సీసీఎస్​పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. విచారణ అనంతరం మట్వాడ పోలీసు స్టేషన్​కు అప్పగించారు. శనివారం అర్ధరాత్రి దాటాక డ్యూటీలో ఉన్న ఇద్దరు కానిస్టేబుల్స్​లైట్స్​ఆఫ్​చేసి పడుకోవడంతో అదే అదునుగా భావించిన నిందితుడు.. కానిస్టేబుల్స్​ఉన్న గదిని లాక్​చేసి ఎస్కేప్​అయినట్లు తెలిసింది. కాగా నిందితుడు ఎలా తప్పించుకున్నాడో చూద్దామనకుంటే స్టేషన్​లోని సీసీ కెమెరాల ఫుటేజీ రికార్డ్​కాలేదు. ఉన్నతాధికారులకు ఏం సమాధానం చెప్పాలో తెలియక పోలీసులు సతమతం అవుతున్నట్లు సమాచారం.