నాలుగు నెలల జీతాలు చెల్లించాలి..మిషన్ భగీరథ పంప్ హౌస్కు తాళం వేసి సిబ్బంది ధర్నా

నాలుగు నెలల జీతాలు చెల్లించాలి..మిషన్ భగీరథ పంప్ హౌస్కు తాళం వేసి సిబ్బంది ధర్నా
  • మిషన్​ భగీరథ పంప్​ హౌస్​కు తాళం వేసి సిబ్బంది ధర్నా 
  • భూపాలపల్లి జిల్లాలో 3 మండలాల్లో నీటి సరఫరా బంద్

వెంకటాపూర్​ (రామప్ప), వెలుగు:  జీతాలు ఇవ్వకుండా కాంట్రాక్టర్​ నిర్లక్ష్యం చేస్తున్నారని మిషన్​భగీరథ సిబ్బంది విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. భూపాలపల్లి జిల్లా వెంకటాపూర్​ మండలం పాలంపేటలోని మిషన్​భగీరథ పంప్​ హౌస్​ ద్వారా వెళ్లే పైపులైన్ ను బంద్ చేసి గేటుకు తాళం వేసి ధర్నాకు దిగారు. పంప్​ హౌస్​పరిధిలో ములుగు(72), వెంకటాపూర్​(54), గోవిందరావుపేట(45) మండలాల్లోని 171 ఆవాస గ్రామాల్లో తాగునీటి సరఫరా చేస్తున్నారు. 

150 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఈనెల చివర వారమైనా ఇంకా వేతనాలు చెల్లించలేదు. దీంతో నాలుగు నెలల వేతనాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్​చేస్తూ విధులు  బహిష్కరించి ధర్నా చేపట్టారు.  దీంతో 3 మండలాలకు తాగునీటి సరఫరా బంద్​ అయింది.  తమకు వేతనాలు ఇవ్వాలని గతంలోనే అధికారులు, కాంట్రాక్టర్లకు వినతిపత్రం అందజేసినా పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.  దసరా సమీపించడంతో కుటుంబాలకు కొత్తబట్టలైన కొనుక్కోవద్దా అంటూ కాంట్రాక్టర్ ను ప్రశ్నించారు.   అధికారులు స్పందించి  జీతాలు చెల్లించేలా చొరవ తీసుకోవాలని కోరారు.  కాంట్రాక్టర్​ భాస్కర్ రెడ్డి స్పందిస్తూ.. విడతల వారీగా సిబ్బందికి వేతనాలు చెల్లిస్తామని తెలియజేశామని, దీంతో ఆందోళన విరమించినట్లు తెలిపారు.   సిబ్బంది ధర్మతేజ, పవన్​, సుమన్​, రాజు, ప్రకాష్​, దేవేందర్ పాల్గొన్నారు.