ఓట్ల కోసం రక్షణ బలగాలను వాడుకుంటారా?

ఓట్ల కోసం రక్షణ బలగాలను వాడుకుంటారా?

కోల్ కతా: రక్షణ దళాలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. 'కేంద్ర బలగాలను ప్రభుత్వం తన స్వార్థం కోసం వాడుతోంది. చాలా చోట్ల ఒక పార్టీకి ఓట్లు వేసేలా ఓటర్లను, తృణమూల్ నేతలను యూనిఫాంలో ఉన్న దళాలు బెదిరించడం నా దృష్టికి వచ్చింది' అని మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎనిమిది దశల్లో ఓటింగ్ నిర్వహించడం పైనా దీదీ ఫైర్ అయ్యారు. ఇది ఆశ్చర్యకరమనీ.. దీని వెనుక ప్రధాని మోడీ సూచనలు ఉండొచ్చునన్నారు.