విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌ టీ20 చాలెంజ్‌‌‌‌ జట్ల ప్రకటన

విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌ టీ20 చాలెంజ్‌‌‌‌ జట్ల ప్రకటన

ఢిల్లీ:  విమెన్స్ టీ20 చాలెంజ్‌‌‌‌కు రంగం సిద్ధమైంది. ఈ నెల 23న పుణెలోని ఎంసీఏ స్టేడియంలో ట్రయల్ బ్లేజర్స్,​ సూపర్​ నోవాస్​ మధ్య జరిగే మ్యాచ్​తో ఈ టోర్నీ ప్రారంభంకానుంది. ఈ టోర్నీలో పోటీపడబోతున్న మూడు జట్లను బీసీసీఐ సోమవారం ప్రకటించింది. సూపర్​ నోవాస్ కు హర్మన్‌‌‌‌ప్రీత్ కౌర్‌‌‌‌, ట్రయల్‌‌‌‌​బ్లేజర్స్ కు స్మృతి మంధాన​, వెలాసిటీ జట్టుకు దీప్తి శర్మను  కెప్టెన్లుగా ఎంపిక చేసింది. కానీ, గత సీజన్‌‌‌‌లో ఆడిన సీనియర్ ప్లేయర్లు మిథాలీ రాజ్, జులన్​ గోస్వామితో పాటు శిఖా పాండేకు ఈ మూడు జట్లలో చోటు దక్కలేదు. గతేడాది వరకు వెలాసిటీ టీమ్‌‌‌‌కు కెప్టెన్‌‌‌‌గా ఉన్న మిథాలీ, జులన్‌‌‌‌కు విశ్రాంతి ఇచ్చినట్లు  బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. కాగా,  హైదరాబాద్‌‌‌‌ ప్లేయర్లు అరుంధతి రెడ్డి (ట్రయల్​ బ్లేజర్స్), ప్రణవి చంద్ర (వెలాసిటీ) ఈ టోర్నీలో బరిలో దిగబోతున్నారు. ప్రతి టీమ్‌‌‌‌లో నలుగురు ఫారిన్‌‌‌‌ ప్లేయర్లను కూడా తీసుకున్నారు.

మరిన్ని వార్తలు