వచ్చే ఏడాదే స్టార్ట్‌‌ చేయాలి..బీసీసీఐ ఆలస్యం చేయొద్దు

వచ్చే ఏడాదే స్టార్ట్‌‌ చేయాలి..బీసీసీఐ ఆలస్యం చేయొద్దు

మహిళల ఐపీఎల్‌‌ను  ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వచ్చే ఏడాదే ప్రారంభించాలని ఇండియా వన్డే టీమ్‌‌కెప్టెన్​ మిథాలీ రాజ్​ బీసీసీఐని కోరింది.  ‘మహిళల ఐపీఎల్‌‌విషయంలో బీసీసీఐ సుదీర్ఘ కాలం వేచి చూడకూడదు. వచ్చే ఏడాదే లీగ్‌‌ప్రారంభించాలని కోరుతున్నా. నిబంధనల్లో చిన్న చిన్న మార్పులు చేసైనా చిన్నస్థాయి ఐపీఎల్​ మొదలుపెట్టాలి. పురుషుల ఐపీఎల్‌‌లో తుది జట్టులో గరిష్టంగా నలుగురు ఫారిన్‌‌ప్లేయర్లకు అనుమతిస్తారు. మహిళల ఫస్ట్‌‌ఎడిషన్‌‌లో అవసరమైతే ఐదు లేదా ఆరుగురు విదేశీ క్రికెటర్లను ఆడించండి.  డొమెస్టిక్​ క్రికెట్‌‌లో ఎక్కువ మంది మహిళా క్రికెటర్లు లేరని నేను ఒప్పుకుంటా. కానీ, ఇప్పుడున్న ఫ్రాంచైజీలే మహిళా జట్లను ఏర్పాటు చేయడం కీలకం. బీసీసీఐ ఇప్పటికే నాలుగు జట్లను ఏర్పాటు చేసినందున కనీసం ఐదు లేదా ఆరు జట్లతో ముందుకెళ్లాలి. ఈ విషయంలో మనం ఎల్లవెళ్లలా ఎదురు చూడకూడదు. ఏదో ఒక టైమ్‌‌లో లీగ్‌‌ఆరంభం కావాల్సిందే. ఆ తర్వాత ప్రతి ఏడాదీ జట్ల సంఖ్యను పెంచుకుంటూ వెళ్లాలి. పురుషుల మాదిరిగా తుది జట్టులో ఫారిన్‌‌ప్లేయర్ల సంఖ్య నాలుగుకు తగ్గించాలి’ అని మిథాలీ  అభిప్రాయపడింది. ఇక, టీ20 వరల్డ్​కప్​లో అదరగొట్టిన షెఫాలీ వర్మను వన్డే జట్టులోకి తీసుకోవాలని ఈ  హైదరాబాదీ సూచించింది. వన్డేల్లో అవకాశం ఇవ్వకపోవడానికి ఆమె వయసు ప్రామాణికం కాకూడదు అని మిథాలీ అభిప్రాయపడింది.