థాయిలాండ్ ఓపెన్ లో భారత్ కు మిశ్రమ ఫలితాలు..

థాయిలాండ్ ఓపెన్ లో భారత్ కు మిశ్రమ ఫలితాలు..
  • థాయిలాండ్ ఓపెన్ లో రెండో రౌండ్ కు కిదాంబి శ్రీకాంత్
  • ఉమెన్స్ సింగిల్స్ ఫస్ట్ రౌండ్ లో గెలిచిన మాళవిక బన్సూద్
  • ఫస్ట్ రౌండ్ లో సౌత్ కొరియన్ చేతిలో సైనా నెహ్వాల్ ఓటమి
  • మిక్సడ్ డబుల్స్ తొలిరౌండ్ లో సుమీత్ రెడ్డి, అశ్విని పొన్నప్ప జోడీ ఇంటిముఖం

థాయిలాండ్ ఓపెన్ 2022లో సైనా నెహ్వాల్ ఓడిపోయింది. ఉమెన్స్ సింగిల్స్ ఫస్ట్ రౌండ్ లో  సౌత్ కొరియా ప్లేయర్ కిమ్ గా యున్ చేతిలో 21-11,15-21,17-21తో పరాజయం పాలైంది. మొదటి గేమ్ లో కిమ్ పై   పూర్తి ఆధిపత్యం చూపిన సైనా...రెండో గేమ్ లో సౌత్ కొరియా ప్లేయర్ జోరుకు నిలవలేకపోయింది.  చివరి గేమ్ లోనూ కిమ్ గా యున్ స్మాష్ లకు సైనా సమాధానం చెప్పలేకపోయింది. మెన్స్ సింగిల్స్ లో  8వ సీడ్ కిదాంబి శ్రీకాంత్ రెండో  రౌండ్లోకి అడుగుపెట్టాడు. ఫష్ట్ రౌండ్ లో అతను ఫ్రాన్స్  ఆటగాడు  బ్రైస్ లెవర్డెజ్ పై 18-21,21-10,21-16 స్కోరు తేడాతో కష్టపడి గెలిచాడు. అటు మహిళల సింగిల్స్ లో మాళవిక బన్సూద్ రెండో రౌండ్ కు చేరుకుంది. ఉక్రెయిన్ క్రీడాకారణిపై 17-21,21-15,21-11 స్కోరు తేడాతో విజయం సాధించింది. ఇక మిక్సడ్ డబుల్స్ లో సుమీత్ రెడ్డి, అశ్విని పొన్పప్ప జోడి తొలి రౌండ్ లోనే ఇంటిముఖం పట్టింది. జపాన్ కు చెందిన జోడి చేతిలో 17-21,17-21 స్కోరు తేడాతో పరాజయం చవిచూసింది. 

మరిన్ని వార్తల కోసం 

అభిమాని లేఖకు ధోని ఫిదా..రిప్లై ఏమిచ్చాడో తెలుసా

కేసీఆర్ కుటుంబాన్ని తరిమి కొట్టే రోజులు దగ్గరపడ్డయ్