- ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
జడ్చర్ల టౌన్, వెలుగు: జడ్చర్ల మున్సిపాలిటీకి రూ.4 కోట్ల ముడా నిధులు కేటాయించి, అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హామీ ఇచ్చారు. ఓపెన్ జిమ్ కు కూడా నిధులు మంజూరు చేస్తానని పేర్కొన్నారు. జడ్చర్ల పట్టణంలోని సీనియర్ సిటిజన్భవన పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు.
బీఆర్ఎస్హయాంలో మాజీ ఎమ్మెల్యే రూ.30 కోట్ల ముడా నిధులను మహబూబ్నగర్ కు ఇచ్చారని ఆరోపించారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కోనేటి పుష్పలత, కౌన్సిలర్లు, నాయకులు, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.
